కేంద్రం కులగణన చేపట్టాలి- ఆర్. క్రిష్ణయ్య డిమాండ్

-

కులగణనపై గళం విప్పారు ఆర్. క్రిష్ణయ్య. జన గణనలో భాగంగా కులగణన చేపట్టేందుకు కేంద్రంపై ఒత్తడి తెచ్చేందుకు ప్రతిపక్షాలన్ని ఏకం కావాలని.. ఈ పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రంపై ఒత్తడి తీసుకురావాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్. క్రిష్ణయ్య పిలుపునిచ్చారు. ఈమేరకు అన్ని రాజకీయ పార్టీలను క్రిష్ణయ్య కోరారు. సీఎం కేసీఆర్ బీసీల సంక్షేమం కోసం బీసీ గణన చేపట్టాలని అసెంబ్లీలో తీర్మాణం చేసి పంపారన్నారు. ప్రధానమంత్రి బీసీ అని చెప్పుకుంటూ బీసీలకు వెన్ను పోటు పొడుస్తున్నారని ఆరోపిస్తున్నారు. బీసీల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. బీసీల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పటు చేయాలని కోరితే బీజేపీ సన్నాయి నొక్కులు నొక్కుతుందని ఆరోపించారు. బీసీలను ఎన్నికల్లో ఓట్లుగానే చూస్తున్నారని.. వారి హక్కుల్ని కాలరాసేలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం , ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటు పరం చేయడాన్ని ఆపాలంటూ కేంద్రం తీరుపై మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news