ఏపి కరోనా అప్డేట్.. ఇవాళ 208 కేసులు

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు ఇవాళ కాస్త తగ్గుముఖం పట్టాయి. నిన్న 250కి పైగా కరోనా కేసులు నమోదు కాగా ఇవాళ సంఖ్య భారీగా పడిపోయింది. ఇక తాజాగా ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం., ఏపీ వ్యాప్తంగా గడిచిన 24 గంటల లో కొత్తగా 208 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఆంధ్ర ప్రదేశ్‌ లో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 20,69, 978 కి పెరిగింది.

ఒక్క రోజు వ్యవధిలో మరో ముగ్గురు చనిపోవడంతో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 14, 415 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 3086 యాక్టివ్‌ కరోనా కేసులు ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో 247 మంది బాధితులు కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇక నిన్న ఒక్క రోజే ఏపీలో 32 , 630 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా ఇప్పటి దాకా 2, 99 , 83, 209 కరోనా పరీక్షలు చేసినట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇక ఇప్పటి దాకా కరోనా బారిన పడి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 20, 52 , 477 లక్షలకు చేరింది.

Read more RELATED
Recommended to you

Latest news