ఫేస్ బుక్ లో ప్రేమ..మదనపల్లి లాడ్జ్ లో యువతి ఆత్మహత్యాయత్నం..అసలు ట్విస్ట్ ఇదే..!

-

ఆన్లైన్ ప్రేమల మాయలో పడి ఎంతోమంది యువతులు మోసపోతున్నారు. సోషల్ మీడియా వేదికగా కేటుగాళ్లు యువతులకు గాలం వేసి డబ్బులు గుంజడమే కాకుండా దారుణాలకు పాల్పడుతున్నారు. తాజాగా బెంగుళూరు కు చెందిన ఓ యువతి ఏపిలోని మదనపల్లి కి చెందిన యువకుడితో ప్రేమలో పడి మోసపోయింది. బెంగుళూరు లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్న షబియా అనే యువతికి మదనపల్లి లోని అబీద్ అనే యువకుడు పరిచయం అయ్యాడు.

ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం కాస్తా ప్రేమగా మారడం తో కేటుగాడు పెళ్లి చేసుకుంటా చెప్పి యువతి దగ్గర డబ్బులు తీసుకున్నాడు. పెళ్లి బట్టులు మరియు సామాన్లు కొనాలని మొత్తం రూ.3లక్షలు తీసుకున్నాడు. అయితే ఇటీవల అబీద్ ముఖం చాటేస్తుండటం తో షబియా నేరుగా మదనపల్లి లోని అతడి ఇంటికి వచ్చింది. కానీ అతడు పెళ్లికి నో చెప్పడంతో తో పోలీసులను ఆశ్రయించింది. అయితే ఇప్పటివరకు పోలీసులు ఆ కేసును పట్టించుకోకపోవడం తో మళ్ళీ మదనపల్లి వచ్చిన యువతి లాడ్జ్ లో ఆత్మహత్య యత్నం చేసింది. లాడ్జ్ సిబ్బంది ఆస్పత్రికి తరలించడం తో ప్రాణాపాయం తప్పింది.

Read more RELATED
Recommended to you

Latest news