పెన్నులు, బుక్స్ కొనిస్తాన‌ని న‌మ్మించి.. బాలిక‌పై అత్యాచారం

-

దేశంలో మాన‌వత విలువ‌లు ప‌డిపోతున్నాయి. వాయి వ‌రుస‌లు, వ‌య‌సుతో సంబంధం లేకుండా.. మానవ మృగాలు త‌మ కోరిక‌ల‌ను తీర్చుకుంటున్నారు. చిన్న పిల్ల‌ల‌ను కూడా ఈ కిరాత‌కులు విడిచిపెట్ట‌డం లేదు. ఇలాంటి ఘ‌ట‌న‌లు దేశంలో చాలా చోట్ల చోటు చేసుకుంటున్నాయి. తాజా గా తెలంగాణ రాష్ట్రంలోని వ‌రంగ‌ల్ జిల్లాలో కూడా ఓ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఒక బాలిక‌కు పెన్నులు, బుక్స్ కొనిస్తాన‌ని మాయ మాట‌లు చెప్పి అత్చాచారానికి పాల్ప‌డ్డాడు.

ఈ దారుణ‌మైన ఘ‌ట‌న వ‌రంగ‌ల్ జిల్లాలోని ఎంహెచ్ న‌గ‌ర్ లో జ‌రిగింది. ఇంటి ముందు ఆడుకుంటున్న బాలిక‌ను పెన్నులు, పుస్త‌కాలు కొనిస్తాన‌ని గౌస్ అనే వ్య‌క్తి న‌మ్మించాడు. ఆ బాలికను తీసుకుని పాత బంగ్లాలోకి వెళ్లి.. అత్యాచారం చేశాడు. బాలిక కేక‌లు వేయ‌డంతో స్థానిక‌లు అక్క‌డికి చేరారు. అందరు రావ‌డం గ‌మ‌నించిన గౌస్.. అక్క‌డి నుంచి దూరంగా ప‌రిగెత్తాడు. దీంతో స్థానికులు గౌస్ ఇంటిపై దాడి చేసి ఫర్నిచ‌ర్ ధ్వంసం చేశారు. బాలిక‌పై అఘాయిత్యానికి పాల్ప‌డ్డ గౌస్ ను క‌ఠినంగా శిక్షించాల‌ని డిమాండ్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news