అతిలోక సుందరిని తలపిస్తున్న భాగ్యశ్రీ కూతురు.. టాలీవుడ్ ఎంట్రీ అప్పుడే..!!

-

ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ భాగ్యశ్రీ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన అందంతో నటనతో ప్రేక్షకులను మెప్పించిన భాగ్యశ్రీ తన కూతుర్ని కూడా ఇండస్ట్రీలోకి పరిచయం చేస్తోంది . ఇకపోతే ఇటీవల బెల్లంకొండ సురేష్ రెండవ కుమారుడు గణేష్ హీరోగా పరిచయమైన స్వాతిముత్యం సినిమా గతవారం జనం ముందుకొచ్చి, పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది. ఈ నేపథ్యంలోనే అతని రెండో సినిమాకు సంబంధించిన ప్రచారానికి కూడా దర్శక నిర్మాతలు శ్రీకారం చుట్టారు. ఇక అల్లరి నరేష్ హీరోగా నాంది చిత్రాన్ని నిర్మించి విమర్శకుల ప్రశంసలు అందుకున్న నిర్మాత సతీష్ వర్మ.. ఇప్పుడు బెల్లంకొండ గణేష్ తో ఎస్ వి 2 ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రెండో సినిమాను నిర్మించబోతున్నారు.

ఈ సినిమా ద్వారా అలనాటి అందాల కథానాయక బాలీవుడ్ హీరోయిన్ భాగ్యశ్రీ కుమార్తె అవంతిక దస్సాని హీరోయిన్గా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఇకపోతే గతంలో భాగ్యశ్రీ కూడా తెలుగు సినిమాలలో నటించి తెలుగు అభిమానుల మన్ననులు పొందిన విషయం తెలిసిందే. ఇక ” నేను స్టూడెంట్ సార్” అనే పేరుతో ఈ సినిమాను రాఖీ ఉప్పలపాటి తెరకెక్కిస్తున్నారు.

ఇక దర్శకుడు కృష్ణ చైతన్య కథను అందించారు. అంతేకాదు ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి ఫస్ట్ లుక్ లో గణేష్ టెర్రిఫిక్ గా కనిపించారు. ఇక అవంతిక ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా తెలియజేసే పోస్టర్ రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాలో అవంతిక శృతి వాసుదేవన్ అనే కాలేజ్ స్టూడెంట్ పాత్రను పోషిస్తుంది.

కళ్యాణ్ చక్రవర్తి డైలాగ్స్ అందించగా, చోటా కె ప్రసాద్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఇకపోతే శ్రీకాంత్ అయ్యంగార్, ఆటో రాంప్రసాద్ , చరణ్ దీప్, ప్రమోదిని, రవి సాయి తేజ తదితరులు ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాలో నటించబోతున్న అవంతిక అందాల తారగా .. అతిలోకసుందరిగా.. దివి నుంచి భువికి కి దిగివచ్చిన దేవకన్యలా చూపుర్లను ఆకట్టుకుంటుంది .అందానికి ఏమాత్రం తగ్గకుండా ఈ ముద్దుగుమ్మ అందాలు ఆకట్టుకుంటున్నాయని చెప్పడంలో సందేహం లేదు.

Read more RELATED
Recommended to you

Latest news