18న పట్టాలెక్కనున్న ‘భారత్ గౌరవ్’ రైలు.. పూరీ, కాశీ, అయోధ్యల్లో యాత్ర

-

తీర్థయాత్రలకు వెళ్లే భక్తులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. దక్షిణ మధ్య రైల్వే నుంచి తొలి భారత్‌ గౌరవ్‌ పర్యాటక రైలు ఈనెల 18న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్​ నుంచి పట్టాలు ఎక్కనుంది. ‘పుణ్యక్షేత్ర యాత్ర’ పేరుతో పూరీ, కాశీ, అయోధ్య క్షేత్రాల్ని సందర్శించుకునేలా యాత్ర ప్రణాళిక రూపొందించినట్లు ద.మ.రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ తెలిపారు. రెండో ట్రిప్‌ ఏప్రిల్‌ 18న మొదలవుతుందని, ప్రతి నెలా ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంటుందని ఆయన వెల్లడించారు.

8 రాత్రులు, 9 రోజులపాటు ఈ యాత్ర సాగుతుంది. సికింద్రాబాద్‌ స్టేషన్‌లో 18న ప్రారంభమయ్యే భారత్‌ గౌరవ్‌ రైలు..పూరీ, కోణార్క్‌, గయ, వారణాసి, అయోధ్య, ప్రయాగ్‌రాజ్‌ చేరుకుంటుంది. అక్కడి నుంచి తిరుగు ప్రయాణమై 26 ఉదయం 6 గంటలకు సికింద్రాబాద్‌కు చేరుకోవడంతో యాత్ర ముగుస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ రైలు సికింద్రాబాద్‌, కాజీపేట, ఖమ్మం, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, విశాఖపట్నం, విజయనగరం స్టేషన్లలో ఆగుతుంది.

ప్యాకేజీలో ప్రయాణ ఛార్జీలు, స్థానిక రవాణా, భోజనం, వసతి ఖర్చులు కలిపి ఉంటాయని ద.మ.రైల్వే తెలిపింది. స్లీపర్‌లో: సింగిల్‌ షేరింగ్‌ రూ.15,300, గదిని ఇద్దరు, ముగ్గురు షేర్‌ చేసుకుంటే రూ.13,955 ; 5-11 ఏళ్ల పిల్లలకు రూ.13,060.

థర్డ్‌ ఏసీలో: సింగిల్‌ షేరింగ్‌ రూ.24,085, గదిని ఇద్దరు లేదా ముగ్గురు షేర్‌ చేసుకుంటే రూ.22,510; 5-11 ఏళ్ల పిల్లలకు రూ.21,460.

సెకండ్‌ ఏసీలో: సింగిల్‌ షేరింగ్‌ రూ.31,510, గదిని ఇద్దరు లేదా ముగ్గురు షేర్‌ చేసుకుంటే రూ.29,615; 5-11 ఏళ్ల పిల్లలకు రూ.28,360.

Read more RELATED
Recommended to you

Latest news