BREAKING: ప్రయాణికులకు అలర్ట్.. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో విమానాల రద్దు !

-

BREAKING: శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు వెళ్ళే ప్రయాణికులకు అలర్ట్. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో విమానాల రద్దు అయ్యాయి. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో పలు విమానాల రద్దు అయ్యాయి. దీంతో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ప్రయాణీకులు ఆందోళనకు దిగారు.

హైదరాబాద్ నుండి పలు ప్రాంతాలకు వెళ్లాల్సిన, రావాల్సిన ఎయిర్ ఇండియా ఎయిర్ లైన్స్ విమానాలు రద్దు అయ్యాయి. అయితే దీనిపై ప్రయాణీకులకు సమాచారం అందించలేదు ఎయిర్ లైన్స్ సంస్థ. ఈ తరుణంలో తెల్లవారుజామున శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నారు 40 మంది ప్రయాణీకులు. విమానాలు రద్దు అయ్యాయని చెప్పింది ఎయిర్‌లైన్స్ సంస్థ. దీంతో సిబ్బందితో తీవ్ర వాగ్వాదానికి దిగారు ప్రయాణీకులు.

Read more RELATED
Recommended to you

Latest news