బ్రేకింగ్; ఏపీలో కొత్తగా 9 కేసులు…!

-

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఏపీలో 9 కేసులు నమోదు అయ్యాయని అధికారులు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం కాసేపటి క్రితం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ఈ బులిటెన్ లో 9 కేసులు నమోదు అయినట్టు చెప్పింది. దీనితో కేసుల సంఖ్య 534 గా ఉంది రాష్ట్రంలో. కొత్తగా కృష్ణా జిల్లాలో 3, కర్నూలు జిల్లాలో 3, పశ్చిమ గోదావరి 3 కేసులు నమోదు అయ్యాయి.

గుంటూరు జిల్లాలో అత్యధికంగా 122 కేసులు నమోదు అయ్యాయి. కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న వారి సంఖ్య 20 గా ఉండగా 14 మంది ప్రాణాలు కోల్పోయారు. పశ్చిమ గోదావరి జిల్లా, కృష్ణా, కర్నూలు మూడు జిల్లాలు హాట్ స్పాట్ జాబితాలోనే ఉన్నాయి. తూర్పు గోదావరి 17, అనంతపురం 21 కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటికే గుంటూరు జిల్లాలో లాక్ డౌన్ ని అధికారులు కతినంగా అమలు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news