జ్యోతిష్యం పేరు చెప్పి.. మూడు కోట్లకు ముంచేశాడు..?

-

కష్టాల్లో ఉన్నప్పుడే మనకు జాతకాలు గుర్తొస్తాయి. ఇబ్బందుల్లో పడగానే జ్యోతిష్యులు గుర్తొస్తారు. కష్టాల నుంచి వారు బయటపడేస్తారని గుడ్డిగా నమ్మేస్తారు. ఇదే అలుసుగా చూసుకుని వారు బాధితుల నెత్తిన శఠగోపం పెడుతున్నారు. తాజాగా ఇలాంటి మరో విషయం వెలుగు చూసింది.

గుంటూరుకు చెందిన శంకరరావు హోల్‌సేల్‌ వ్యాపారం చేస్తుంటాడు. ఆయన దగ్గర పని చేసే ఓ మేనేజర్ ఏకంగా మూడు కోట్ల రూపాయలతో ఉడాయించాడు. అతడిని వెదుక్కుంటూ శంకర్రావు హైదరాబాద్ వచ్చాడు. రెండు నెలల పాటు హైదరాబాద్‌ అంతటా వెదికినా శ్రీనివాసరావు ఆచూకీ లభించలేదు.

 

ఈ సమయంలోనే ఆయన కోడలు ఓ జ్యోతిష్యుడి విషయం చెప్పింది. అతడు దోషనివారణ పూజలు చేస్తానన్నాడు. పూజలపేరుతో కొంత సొమ్ము స్వాహా చేశాడు. అంతే కాదు.. తనకు 30 మందికి పైగా పోలీసు ఉన్నతాధికారులు తెలుసని నమ్మబలికాడు. పారిపోయిన శ్రీనివాసరావు ఆచూకీ చెప్పేలా చేస్తానన్నాడు.

మొత్తం మీద కోటిన్నర రూపాయల వరకూ దండుకున్నాడు. ఆ తర్వాత ఏకంగా బోర్డు తిప్పేశాడు. పది రోజుల క్రితం ఆ జ్యోతిష్కుడు తన ఫ్లాట్‌ ఖాళీ చేయడంతో మోసపోయానని గ్రహించిన శంకరరావు పోలీసులను ఆశ్రయించాడు. మొత్తం మీద మేనేజర్ మూడు కోట్లు, జ్యోతిష్యుడు కోటిన్నర మొత్తం నాలుగున్నర కోట్లు రూపాయలు మునిగిపోయాడు పాపం శంకర్రావు. హైదరాబాద్‌ సెంట్రల్‌క్రైమ్‌ పోలీసులు వాళ్లను పట్టుకునే పనిలో ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news