‘సరిలేరు నీకెవ్వరుకు’ కు పోటీగా ‘అల వైకుంఠపురములో’ టీజర్ వస్తోంది….!!

-

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో సరిలేరు నీకెవ్వరు సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే 90 శాతానికి పైగా షూటింగ్ ని పూర్తి చేసుకున్న ఈ సినిమా అఫీషియల్ టీజర్ రేపు సాయంత్రం యూట్యూబ్ లో రిలీజ్ చేయనుంది సినిమా యూనిట్. ఎల్లుండి దర్శకుడు అనిల్ రావిపూడి బర్త్ డే కావడంతో ఒకరోజు ముందుగా ఈ సినిమా టీజర్ ని రిలీజ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. సూపర్ స్టార్ మహేష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ద్వారా విజయశాంతి చాలా రోజుల తరువాత టాలీవుడ్ కి నటిగా రీఎంట్రీ ఇస్తోంది. కాగా సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా రిలీజ్ కాబోతోంది.

ఇకపోతే ఈ సినిమాకు పోటీగా సరిగ్గా అదే రోజున స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరియు త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబినేషన్లో తెరకెక్కుతున్న అలవైకుంఠపురములో సినిమా కూడా రిలీజ్ కాబోతుండడంతో, ఆయా హీరోల ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకుల్లో కూడా రెండు సినిమాలపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇక ఇప్పటికే చాలా రోజుల క్రితమే ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది ఈ సినిమా యూనిట్. తమ సినిమా నుండి రెండు లిరికల్ సాంగ్స్ రిలీజ్ చేసి, శ్రోతల నుండి మంచి స్పందన అందుకున్న ఈ సినిమా యూనిట్, రేపు సాయంత్రం సినిమాలోని మూడవ సాంగ్ అయిన ‘ఓ మై గాడ్ డాడీ’ లిరికల్ సాంగ్ ని యూట్యూబ్ లో రిలీజ్ చేయబోతోంది.

అయితే సరిలేరు యూనిట్ ముందుగా సాంగ్స్ కాకుండా టీజర్ రిలీజ్ చేస్తుండడంతో, అలవైకుంఠపురములో యూనిట్ కూడా మరొక పది రోజుల్లో, అనగా డిసెంబర్ మొదటి వారంలో తమ సినిమా టీజర్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు టాలీవుడ్ వర్గాల టాక్. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త కనుక నిజమే అయితే, సరిలేరు యూనిట్ కు, అలవైకుంఠపురములో యూనిట్ గట్టి పోటీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది. మరి సంక్రాంతి కానుకగా రాబోతున్న ఈ రెండు సినిమాల్లో ఏది, ఎంతమేర సక్సెస్ అవుతుందో చూడాలి….!!

Read more RELATED
Recommended to you

Latest news