చంద్రబాబుకు భారీ ఊరట.. మూడు కేసుల్లో ముందస్తు బెయిల్

-

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. ఒకేసారి మూడు కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ.. ఉన్నత న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు, మద్యం కేసు, ఇసుక కేసు, ఇలా మూడు కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఇన్నర్ రింగ్ రోడ్డు, ఇసుక, మద్యం వ్యవహారాల్లో అక్రమాలు జరిగాయంటూ ఏపీ సీఐడీ చంద్రబాబు పై కేసులు నమోదు చేసింది.

వీటిపై ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టులో చంద్రబాబు 3 పిటిషన్లు దాఖలు చేశారు. వాదనలు ముగిసిన నేపథ్యంలో కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో తొలుత మధ్యంత బెయిల్ పొందిన చంద్రబాబుకు ఆ తరువాత రెగ్యులర్ బెయిల్ కూడా మంజూరు చేసింది ఏపీ హైకోర్టు.. ఐఆర్ఆర్, మధ్యం కేసు, ఇసుక కేసుల్లో చంద్రబాబు పై సీఐడీ కేసులు నమోదు చేయగా.. ముందస్తు బెయిల్ కోసం హై కోర్టును ఆశ్రయించారు. తాజాగా హై కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news