వైసీపీ మాజీ ఎంపీ ఎంవీవీకి బిగ్ రిలీప్..!

-

హయగ్రీవ భూముల కేసులో విశాఖ వైసీపీ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు భారీ ఊరట లభించింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న బిల్డర్ గద్దె బ్రహ్మాజీ, సీఏ జి. వెంకటేశ్వరరావు, మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు కోర్టు షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.

విశాఖ జిల్లా ఎండాడ గ్రామంలో 12.5 ఎకరాల భూమిని 2008 లో నాటి ప్రభుత్వం వృద్ధుల కోసం
ఇచ్చింది. ఆ భూమిని హయగ్రీవ ప్రాజెక్టుకు కేటాయించింది. 15 సంవత్సరాలుగా ఈ ప్రాజెక్టు కు
అడుగు కూడా ముందుకు కదల్లేదు. కట్ చేస్తే.. ప్రభుత్వం తమ ప్రాజెక్టుకు ఇచ్చిన భూమిని వైసీపీ
నేతలు బలవంతంగా లాక్కున్నారని హయగ్రీవ ఇన్ఫ్రాటెక్ ఎండీ సీహెచ్ జగదీశ్వరుడు ఇటీవలే సెల్ఫీ వీడియో విడుదల చేశారు. ఇది సంచలనానికి దారితీసింది. మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, ఆడిటర్ జీవీ, మరొకరిపై ఆరిలోవ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news