హై కోర్టులో మరోసారి జగన్ సర్కార్ కు చుక్కెదురు

-

అమరావతి : ఉపాధి హామీ పధకం బిల్లులు చెల్లించక పోవడంతో ఏపీ ప్రభుత్వం పై మరోసారి మండిపడింది హైకోర్టు. సెప్టెంబర్ 15వ తేదీ లోపు చెల్లించకపోతే కోర్టు ధిక్కార చర్యలు ప్రారంభిస్తామని హెచ్చరించారు న్యాయమూర్తి జస్టీస్ బట్టు దేవానంద్. రెండు వారాల క్రితం 494 కేసులలో చెల్లింపులు చేయమని ఆదేశిస్తే.. కేవలం 25 కేసులలోనే చెల్లింపులు చేయడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. సర్పంచ్ అకౌంట్లోకి వేస్తే వారు కాంట్రాక్టర్ కి చెల్లించడం లేదని చెప్పారు ప్రభుత్వ న్యాయవాది. అయితే దీనిపై స్పందించిన హై కోర్టు.. వారి వివరాలు ఇస్తే.. వారిపై కూడా కోర్టు ధిక్కార చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

highcourt

కొన్ని కేసులలో విచారణ జరుగుతుందని చెప్పిన ప్రభుత్వ న్యాయవాది.. విచారణ చేయకుండానే.. జరుగుతుందని చెబుతూ కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారని పిటీషనర్ తరపు న్యాయవాదులు కోర్టు కు తెలిపారు. అయితే రెండున్నర సంవత్సరాల తర్వాత ఇప్పుడు విచారణ ఏమిటని ప్రశ్నించింది హైకోర్టు. విచారణ చేపడితే పిటీషనర్లకు నోటీసులు ఇచ్చారా అని ప్రశ్నించిన హైకోర్టు.. రెండున్నర సంవత్సరాల పాటు చెల్లింపులు నిలిపి వేస్తే వారి జీవనాధారం ఏమిటని ప్రశ్నించింది.

ఇరవై నుంచి ముప్పై శాతం చెల్లింపులలో కట్ చేయడం పై వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఈనెల 15వ తేదీ నాటికి ఎవరికి ఎంత మొత్తం చెల్లించారో పిటీషనర్, ప్రభుత్వం రెండూ వివరాలు ఇవ్వాలని ఆదేశించింది హైకోర్టు. ఈనెల 15వ తేదీన చెల్లింపులు జరగకపోతే నేరుగా కోర్టు ధిక్కార చర్యలు, పిటీషనర్ల వారీగా చేపడతామని హెచ్చరికలు జారీ చేసింది హై కోర్టు. ప్రతిసారీ వాయిదా అడుగుతూ జాప్యం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది హై కోర్టు.

Read more RELATED
Recommended to you

Latest news