జనసేన కి మరోసారి షాక్..!

-

జనసేనకి పెద్ద షాక్ తగిలింది కాపు కీలక నేత హరి రామ జోగయ్య కొడుకు సూర్యప్రకాష్ పార్టీకి గుడ్ బాయ్ చెప్పేసాడు. వచ్చే ఎన్నికల్లో జనసేన తరపున ఆయన సీటు ఆశించారు. అయితే జనసేన మొదటి లిస్టులో తనకి ఆశాభంగం కలిగింది పవన్ కళ్యాణ్ ఆశయాలు వచ్చి 2018 లో జనసేనలో చేరారు అయితే తాజాగా ఆయన పార్టీని విడిచి పెట్టేశారు అంతేకాకుండా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి రెడీ అయ్యారు.

ఈ మేరకు మరికాసేపట్లో వైయస్సార్ కాంగ్రెస్ చీఫ్ సీఎం జగన్ ని కలిసి పార్టీలో చేరబోతున్నట్లు తెలుస్తోంది. టీడీపీతో పొత్తు లో భాగంగా జనసేనకి 24 సీట్లు కేటాయించిన విషయం తెలిసిందే దీంతో కాపు నేత జోగయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు తక్కువ సీట్లు తీసుకోవడం పై మండిపడ్డారు చంద్రబాబుని ముఖ్యమంత్రి చేయడానికి పవన్ తక్కువ సీట్లకే ఒప్పుకున్నారని అన్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version