శ్రీవారి భక్తులకు షాక్‌.. రేపు, ఎల్లుండి నడకదారులు మూసివేత

-

తిరుమల : తిరుమల శ్రీ వారి భక్తులను మరో దిమ్మ తిరిగే షాక్‌ తగిలింది. రేపు, ఎల్లుండి రెండు రోజుల పాటు నడక దారులు మూసివేయాలని కీలక నిర్ణయం తీసుకుంది టీటీడీ పాలక మండలి. తిరుమల, తిరుపతిలో మరో రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం వుందని వాతావరణ శాఖ పేర్కొన్న నేపథ్యంలో… టీటీడీ పాలక మండలి ఈ కీలక నిర్ణయం తీసుకుంది.

భక్తులు భద్రత దృష్యా రెండు రోజులు పాటు ముందస్తుగా నడకదారులు మూసివేస్తూన్నట్లు స్పష్టం చేసింది టీటీడీ. ఈ నేపథ్యంలో… శ్రీ వారి భక్తులు ముందస్తుగా అలర్ట్‌ కావాలని సూచనలు చేశారు. టీటీడీ పాలక మండలి సూచించనలు పాటిస్తూ.. శ్రీ వారిని దర్శించుకోవాలని పేర్కొంది. కాగా.. గత వారం రోజుల కింద కూడా నడక దారులు మూసి వేసింది టీటీడీ పాలక మండలి. భారీ వర్షాల నేపథ్యంలో… గత వారం రెండు రోజుల పాటు నడక దారిని మూసివేసింది టీటీడీ.

Read more RELATED
Recommended to you

Latest news