Bigg Boss: రూల్స్ విన‌లేదా? పాటించుకోవ‌డం లేదా? కెప్టెన్సీ టాస్క్ లో రూల్స్ త‌ప్పిన కంటెస్టెంట్లు!

-

Bigg Boss: బిగ్‌బాస్ సీజ‌న్ 5 బుల్లితెర ప్రేక్ష‌కుల‌కు అన్ లిమిటెడ్ ఎంట‌ర్టైన్ మెంట్ ను అందిస్తూ.. స‌క్సెస్ పుల్ గా ర‌న్ అవుతుంది. ఈ షో ఆరు ఎలిమినేష‌న్లు పూర్తి చేసుకుని విజ‌యవంతంగా ఏడో వారంలోకి అడుగుపెట్టింది. ఈ వారం షో మరింత రంజుగా సాగుతోంది. సోమవారం జరిగిన నామినేషన్ల ప్రక్రియలో లోబో, జెస్సీ, శ్రీరామ్‌, ప్రియా, కాజల్‌, సిరి, ఆనీ మాస్టర్‌ నామినేట్‌ అయ్యారు. ఇక మంగళవారం ఎపిసోడ్‌లో నామినేషన్ పై చ‌ర్చ జ‌రిగింది.

మానస్‌ తనని దూరం పెడుతున్నాడని, పట్టించుకోవడం లేదని ప్రియాంక ఫీల్ అయ్యింది. అనీ మాస్టర్ కి ఈ విష‌యాన్ని చెప్పి కన్నీళ్లు పెట్టుకుంది. దీంతో ఆమె కోసం వచ్చాడు మాన‌స్‌. ఆమెని బ్రతిమాలాడు. నామినేషన్‌లో స‌న్నీ.. తన నామినేషన్‌ని తీసుకోలేదని తన బాధని వ్యక్తం చేసింది. అందుకు మానస్ ప్రియాంక‌ను ఓదార్చే ప్రయత్నం చేశాడు. చివరికి అన్నం తినిపిస్తానన్నాడు. అంతేకాదు భోజనం తీసుకొచ్చి ఆమెకి తినిపించాడు.

అనంత‌రం బిగ్ బాస్ ఓ విచిత్ర‌మైన కెప్టెన్సీ టాస్క్ ఇచ్చాడు. బిగ్‌బాస్‌ బంగారు కోడిపెట్ట అనే కెప్టెన్సీ టాస్క్‌ ఇచ్చాడు. ఈ టాస్క్‌లో ఎవ‌రూ ఎక్కువ సంపాదిస్తారో వారు విన్న‌ర్స్.. అయితే..ఇది ఇండివిడ్యువల్‌ గేమ్‌ అని చెప్పారు. అంటే ఎవరి ఆట వారు ఆడాలని తెలిపారు.

కానీ బిగ్‌ బాస్‌ పార్టిసిపెంట్స్‌ ఈ విషయం మరచిపోయినట్లున్నారు. ఇద్దరేసి కలసి ఆడటం సులభంగా కనిపిస్తోంది. రెండోది పట్టుకున్నగుడ్లు బుట్టలోనే ఉంచాలి. కానీ వీటిని ఇంటి సభ్యులు పట్టించుకోలేదు. అందరూ సీరియస్ గా గేమ్ ఆడటానికి సిద్ధమైపోయారు. గొడవలు, కొట్టుకోవడాలతో ఈ టాస్క్ సాగింది.

టాస్క్ గురించి చెప్ప‌గానే.. ప్రియ రెచ్చిపోయింది. నేను అందరి గుడ్ల జోలికొస్తాను, దొంగతనం చేస్తాను, ఎవరేం చేసుకుంటరో చేసుకోండి.. ఇదే నా గేమ్ స్ట్రాటజీ అని హౌస్‌మేట్స్‌ల‌కు ముంద‌స్తు హెచ్చ‌రిక చేసింది. దీంతో అల‌ర్ట్ అయినా సన్నీ.. కాజల్‌ సాయం కోరాడు. ఇది ఇండివిడ్యువల్‌ టాస్క్ కాదా.. సన్నీ, కాజల్ లు కలిసి ఆడటమేంటనీ రవి, యానీ మాస్టర్ లు మాట్లాడుకున్నారు. ఈ టాస్క్‌ రద్దయ్యే అవకాశం ఉంటుంద‌నుకున్నారు.

ఇదిలా ఉంటే.. ప్రియా చెప్పిన‌ట్టే.. సన్నీ బుట్టలోని గుడ్లను దొంగతనం చేసింది. దీంతో స‌న్నీ ఫైర్ అయ్యాడు. తన కష్టం అంతా బూడిదలో పోసిన పన్నీరైందని, ఇంకోసారి తన జోలికొస్తే ఊరుకునేది లేద‌ని స్ట్రాంగ్ వార్నింగ్‌ ఇచ్చాడు. దీంతో ప్రియ ఇంకా రెచ్చిపోయింది. బరా బర్‌ దొంగతనం చేస్తా ’ అని సమాధానమిచ్చింది. అక్కడితో ఆగకుండా గడ్డి పోచ తీసి… గాల్లోకి ఊది ‘నువ్వు గడ్డిపోచ’తో సమానం అని చెప్పింది.

దీంతో సన్నీ ఆగ్ర‌హానికి లోయ్యాడు. చేతగానోళ్లలాగా ఒక మూలన కూర్చోవడం కాదు, గేమ్‌ సరిగ్గా ఆడు అని వార్నింగ్ ఇచ్చాడు. అయినా ప్రియ ఏ మాత్రం త‌గ్గ‌లేదు. నేను దొంగతనం చేస్తా… ఏం చేసుకుంటావో చేసుకో అంటూ ప‌వ‌న్ మ్యాన‌రిజాన్ని దించేసింది. మళ్ళీ ప్రియ సన్నీ బుట్టని పట్టుకోవడానికి ట్రై చేయబోతే సన్నీ ప్రియను నెట్టేయగా ఆమె అతడి మీద చేయి చేసుకోబోయింది. అంతేకాకుండా చెంప పగలగొడతానంటూ వార్నింగ్‌ ఇచ్చింది. ఇలా ఇద్దరూ కొట్టుకునే దాకా వెళ్లడంతో ఇంటి సభ్యులు ఆపడానికి ట్రై చేశారు.

అనంత‌రం ప్రియ దగ్గరకు ఉన్న‌ గుడ్లను మాన‌స్‌కు ఇచ్చేసింది. ప్రియాంక కూడా తన గుడ్లన్నీ మానస్ కి ఇచ్చేసింది. మ‌రో వైపు.. సన్నీ, కాజల్‌ బుట్టల్లోని గుడ్లను సిరి, శ్రీరామ్ ల‌కు ఇచ్చేశారు. ఇండివిజ్యూవ‌ల్ గా ఆడే గేమ్ ను గ్రూప్‌లుగా ఆడి కంప్లీట్ చేశారు. అయ్యేసరికి మానస్ దగ్గర 32 గుడ్లు ఉన్నాయి. మరి ఈ పోటీలో ఎవరు విన్ అయ్యారో, ప్రియా సన్నీల గొడవ ఏమైందో, ఇంకా ఏమేమి కెప్టెన్సీ టాస్క్ లు పెడతారో? నేడి ఎపిసోడ్ లో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news