బిగ్ బాస్: మెరీనా ఎలిమినేట్ అవ్వడానికి అసలు కారణం ఇదే..!

-

తాజాగా బిగ్ బాస్ ఆరవ సీజన్లో 10 మంది హౌస్ లో ఉండగా వారిలో ఎనిమిది మంది నామినేషన్స్ లో ఉన్నారు. వారి నుంచి ఈ వారం మెరీనా అబ్రహం ఎలిమినేట్ అయినట్లు సమాచారం .ఇకపోతే బిగ్ బాస్ హౌస్ లోకి ఒకే కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన ఈ జంటను ఆ తర్వాత విడదీశారు. ఇద్దరు వేరువేరు కంటెస్టెంట్ లే అంటూ చెప్పుకొచ్చారు. అప్పటినుంచి వారి ఆట బాగానే సాగుతుందని అనుకున్నారు. కానీ ఇప్పుడు సడన్గా మెరీనాను ఎలిమినేట్ చేయడంతో ఆమె అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. అయితే మెరీనా ఎలిమినేట్ అవ్వడానికి గల కారణం ఏమిటో ఇప్పుడు చూద్దాం.

మొదట్లో కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ లో చురుగ్గా పాల్గొనడానికి మెరీనాకు అవకాశం లభించలేదు. ఫిజికల్ టాస్క్ ఉన్నా కూడా రోహిత్ ముందుగా పాల్గొనేవాడు. దాంతో జనాలలో పెద్దగా ఈమెకు గుర్తింపు లభించలేదు. ఇక రోహిత్ – మెరీనాకి దాదాపుగా ఒకటే ఫ్యాన్ బేస్ ఉంది. ఇద్దరూ నామినేషన్స్ లో ఉన్నారు అంటే ఫ్యాన్స్ ఓట్లను రెండు భాగాలుగా విడగొట్టాల్సి ఉంటుంది. అంటే వారు వేసే పది ఓట్లలో ఐదు మెరీనా కి, ఐదు రోహిత్ కు వేస్తూ వచ్చారు. ఇలా చేయడం వల్ల వీరికి ఓటింగ్ తగ్గుతూనే వచ్చింది. ఇంకొంతమంది రోహిత్ , మెరీనాలో ఎవరికి ఓటు వేస్తే బాగుంటుంది అని ఆలోచిస్తూ ఎక్కువగా ఓటింగ్ వేస్తూ వచ్చారు. దీంతో మెరీనా ఎలిమినేట్ అవ్వక తప్పలేదు.

మెరీనాకు మొదటి నుండే మథర్ ఇండియా అనే పేరు పెట్టారు. నిజానికి ఆమె ఎప్పుడు ఎవరితో అంతగా గొడవలు పెట్టుకోలేదు.. ఎదుటివాళ్ళు ఆమెను బాధపెట్టినా కూడా రియాక్ట్ కాలేదు. కానీ బిగ్ బాస్ లో ఉన్న ప్రతి విషయానికి రియాక్ట్ అవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ గొడవ లేకపోయినా కావాలని గొడవ పెట్టుకోవాలి. కానీ ఇవేవీ మెరీనా చేయలేదు. అయితే చివర్లో కాస్త మార్పు కనిపించినా కూడా అప్పటికే నష్టం జరిగిపోయింది. ఇప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తున్న మరొక మాట ఏమిటంటే.. శ్రీ సత్య వల్లే మెరీనాను ఎలిమినేట్ చేశారు అని సమాచారం. ఏది ఏమైనా మెరీనా ఎలిమినేట్ అవ్వడంతో అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news