వైఎస్‌ఆర్‌ జిల్లాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం

-

ఏపీలోని వైఎస్ఆర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను లారీ ఢీకొట్టడం వల్ల ముగ్గురు దుర్మరణం చెందారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతులు, గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.

ఎరగుంట్ల మండలం పోట్లదుర్తి గ్రామానికి చెందిన దస్తగిరి(45), సరస్వతి(35),  ప్రేమ్‌కుమార్‌(32) ఆటోలో కొండాపురం మండలం దత్తాపురం వచ్చారు. గత కొన్ని రోజులుగా సరస్వతికి అనారోగ్యంగా ఉండడంతో తాయిత్తు కట్టించుకొని తిరిగి స్వగ్రామానికి ఆటోలో వెళ్తున్నారు. కడప-తాడిపత్రి ప్రధాన రహదారిలోని ముద్దనూరు మండలం చెన్నారెడ్డి పల్లె వద్ద ఎదురుగా వస్తున్న లారీ అదుపుతప్పి ఆటోను ఢీ కొట్టింది.

ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న దస్తగిరి, సరస్వతి అక్కడిక్కడే మృతి చెందారు. గమనించిన స్థానికులు  తీవ్రంగా గాయపడిన ఆటోడ్రైవర్‌ ప్రేమ్‌కుమార్‌ను 108 వాహనంలో ప్రొద్దుటూరు వైద్యశాలకు తరలిస్తుండగా మృతి చెందాడు.  సమాచారం అందుకున్న సీఐ మోహన్‌రెడ్డి, ఎస్సై చంద్రమోహన్‌ ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు.

Read more RELATED
Recommended to you

Latest news