తూర్పుగోదావరి జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం రేపింది. ఈ తరుణంలోనే… చికెన్ తినొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. తణుకు, తాడేపల్లిగూడెం, ఉంగుటూరు, భీమడోలు, కొల్లేరు కాకినాడ, ఏలూరులో కోళ్లు చనిపోవడంతో.. కోళ్ల రక్త నమూనాలు తీసి భోపాల్లోని ల్యాబ్కు పంపారు పశుసంవర్ధకశాఖ అధికారులు.
15 రోజులుగా వణికిస్తున్న వైరస్ ఏవియన్ ఇన్ఫ్లూయెంజా H5N1 అని భోపాల్లోని యానిమల్ డిసీజెస్ ల్యాబ్ తేల్చింది. తణుకు మండలం వేల్పూరు, పెరవలి మండలం కానూరు గ్రామాల్లో చనిపోయిన కోళ్లకు హెచ్5ఎన్1 పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో… చికెన్ తినొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దీంతో ఏపీలో చికెన్ తినే వారి సంఖ్య తగ్గింది. దీంతో రేట్లు కూడా తగ్గిపోయాయి. ఫ్రీగా ఇచ్చిన తీసుకునే పరిస్థితులు లేవు.