వామనరావు మర్డర్ కేసు : పుట్ట మధు మేనల్లుడు అరెస్ట్ !

-

లాయర్ వామనరావు దంపతుల హత్య కేసుకు సంబంధించిన నిందితుడు బిట్టు శ్రీను అరెస్ట్ అయినట్టు తెలుస్తోంది. పెద్దపల్లి జిల్లా జడ్పీ చైర్మన్ అయిన పుట్ట మధుకు మేనల్లుడు అయిన బిట్టు శ్రీనుని మంథనిలో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక వామన రావు దంపతులపై దాడి చేసిన వారికి ఆయుధాలు, వాహనాలు బిట్టు శ్రీను సరఫరా చేసినట్లు ఇప్పటికే పోలీసులు గుర్తించారు. ఇక ఈయన మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకు మేనల్లుడిగా పోలీసులు పేర్కొన్నారు.

ఇక ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి కుంట శ్రీను, అక్క పాక కిరణ్, అలాగే కుమార్ అనే వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే..నిన్న మధ్యాహ్నం సమయంలో వీరిని మహారాష్ట్ర బోర్డర్ లో పట్టుకున్నట్లుగా పోలీసులు ప్రకటించారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే హైకోర్ట్ కూడా సుమోటోగా కేసు నమోదు చేసిన కారణంగా పోలీసులు కూడా ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నట్లు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news