బ్రేకింగ్ : నాగార్జునసాగర్ అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ, ఎవరంటే ?

-

అనేక తర్జనభర్జనలు అనంతరం నాగార్జునసాగర్‌ అసెంబ్లీ స్థానానికి త్వరలో జరగనున్న ఉప ఎన్నికలో బీజేపీ తమ అభ్యర్థిని ఖరారు చేసింది. ముందు నుండీ అనేక పేర్లు వినిపించినా సరే ఎవరూ ఊహించని విధంగా డాక్టర్‌ పానుగోతు రవి కుమార్‌ను అభ్యర్థిగా ఎంపిక చేస్తూ ఆ పార్టీ అధిష్ఠానం ప్రకటన విడుదల చేసింది. నిజానికి బీజేపీ నుండి నుంచి అంజయ్య యాదవ్‌, కంకనాల నివేదితా రెడ్డి కూడా టికెట్‌ ఆశించారు.

గత ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసిన నివేదిత.. టికెట్‌ వస్తుందనే ఆశతో ఇప్పటికే నామినేషన్‌ కూడా దాఖలు చేశారు. అయితే చివరి నిమిషంలో ఈయనకు టికెట్ దక్కింది. నిజానికి ఆయన జానారెడ్డి అనుచరుడు. జనవరిలోనే ఆయనతో విభేదించి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇక టీఆర్ఎస్ అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య తనయుడు నోముల భగత్‌ కు ఆ పార్టీ టికెట్‌ ఖరారు చేసిన నేపథ్యంతో సామాజిక సమీకరణాల ఆధారంగా ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన పానుగోతు రవికుమార్‌ ను బీజేపీ ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.  

Read more RELATED
Recommended to you

Latest news