తెలంగాణకు బీజేపీ చీఫ్ జేపీ నడ్డా రాక … సడెన్ గా ఏంటి విషయం !

-

బీజేపీ దేశ రాజకీయాలలో కీలకంగా వ్యవహరిస్తూ వరుసగా రెండు సార్లు కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు మూడవసారి కూడా అధికారంలోకి రావడానికి తగిన వ్యూహాలను సిద్ధం చేసుకుంటోంది. అంతే కాకుండా దక్షిణ భారతదేశంలోనూ పాగా వేయడానికి తగిన ప్లాన్ లను రెడీ చేసుకుంటోంది. ముఖ్యంగా తెలంగాణాలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే బీజేపీ లక్ష్యంగా మారింది. అందులో భాగంగా కేంద్రం నుండి ఎవరో ఒకరు తెలంగాణ పర్యటనకు వచ్చి కార్యకర్తలతో కలిసి పార్టీని బలోపేతం చేస్తున్నారు.

రేపు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణకు రానున్నాడు. ఇంతకీ ఇంత సడెన్ గా ఎందుకు వస్తున్నాడు అంటే… సంగారెడ్డి లో కొత్తగా ప్రారంభించిన బీజేపీ కార్యాలయాన్ని ఓపెన్ చేయడానికి ఈయన వస్తున్నాడట. ఆ తర్వాత బహిరంగ సభలో పాల్గొని ఢిల్లీకి వెళ్లనున్నారు. కాగా ఏప్రిల్ 8న తెలంగాణ పర్యటనకు ప్రధాని మోదీ రానున్న విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news