విమోచన దినోత్సవం నిర్వహించాలని భాజపా నిర్ణయం..!

-

తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు బీజేపీ సన్నాహాలు చేస్తున్నారు. సెప్టెంబర్‌ 17న పెద్ద ఎత్తున కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు ఈ నెల 17న కేంద్ర హోంశాఖమంత్రి అమిత్‌ షా రాష్ట్రానికి రాబోతున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

ఈ వేడుకలకు అమిత్‌ షాతో పాటు కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే రానున్నారు. సెప్టెంబర్‌ 17న నిర్వహించాల్సిన కార్యక్రమాలపై చర్చించేందుకు భాజపా రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్‌ తరుణ్‌ చుగ్‌ రేపు సాయంత్రం పార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శులతో సమావేశంకానున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news