బీజేపీ పేద‌ల కోసం ప‌ని చేసే పార్టీ.. గెలుపు పై మోడీ

-

ఐదు రాష్ట్రాల్లో ఎన్నిక‌ల ఫ‌లితాల్లో విజ‌యానికి కార‌ణం.. బీజేపీకి పేద ప్ర‌జ‌ల మ‌ద్ధ‌తే అని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ అన్నారు. ఇత‌ర పార్టీలు బీజేపీని నిందించినా.. ప్ర‌జ‌లు త‌మ‌కే ప‌ట్టం క‌ట్టార‌ని అన్నారు. ఉత్త‌ర ప్ర‌దేశ్ రాష్ట్రంలో కుటుంబ పాల‌న, అవినీతి లేదని అన్నారు. అందుకే త‌మ‌కు రెండో సారి విజ‌యం అందించార‌ని అన్నారు. బీజేపీ నిర్ణ‌యాలు, విధానాల‌ను ప్ర‌జ‌లు స్వాగ‌తిస్తున్నార‌ని అన్నారు. బీజేపీ పాల‌నపై ప్ర‌జ‌ల‌కు మ‌రింత న‌మ్మ‌కం పెరిగింద‌ని తెలుస్తోంద‌ని అన్నారు.

ఉత్త‌ర ఖాండ్ లో అధికారాన్ని క‌ట్ట‌బెట్ట‌డంతో పాటు సీట్ల సంఖ్య‌ను పెంచార‌ని మోడీ అన్నారు. గోవాలో కూడా త‌మ‌కు మ‌ళ్లీ అధికారాన్ని ఇచ్చార‌ని అన్నారు. త‌మ కు గెలుపు లో మ‌హిళ‌ల పాత్ర కీల‌కం అని అన్నారు. అలాగే బీజేపీకి తొలిసారి ఓటు వేసిన వారికి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. బీజేపీ జోరు కొన‌సాగుతుందని అన్నారు.

2024లో వ‌చ్చే ఎన్నిక‌ల్లో మ‌రోసారి అధికారంలోకి వ‌స్తామ‌ని ధీమా వ్య‌క్తం చేశారు. అలాగే ఇప్పుడు ఓట‌మి పాలు అయినా.. త‌ర్వాతి ఎన్నిక‌ల్లో బీజేపీ దే విజ‌యం అని అన్నారు. త‌మ ప్ర‌భుత్వం అందిస్తున్న ప‌థ‌కాలు ప్ర‌జ‌లు అంద‌రికీ అందుతున్నాయ‌ని అన్నారు. అందుకే త‌మ‌కు ఇంత‌టి విజ‌యాన్ని అందించార‌ని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news