తెలంగాణ ఎన్నికలు: అభ్యర్థుల విషయంలో ఆచితూచి ఆడుగులేస్తున్న బీజేపీ!

-

తెలంగాణాలో ఎన్నికలకు ఇంకా నలభై రోజులే సమయం ఉండడంతో ఇప్పటికే అధికార పార్టీ BRS మరియు కాంగ్రెస్ లు తమ అభ్యర్థుల జాబితాను విడుదల చేసి బి ఫారం లు కూడా ఇచ్చేశారు. కానీ ఇంకా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మాత్రం పూర్తి స్థాయిలో అభ్యర్థుల జాబితాను విడుదల చేయలేదు. ఢిల్లీ కేంద్రంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా , BL సంతోష్, లక్ష్మణ్, తరుణ్ ఛుగ్, కిషన్ రెడ్డి, డీకే అరుణ, ఈటల రాజేందర్ మరియు బండి సంజయ్ లు సమావేశం అయ్యి అభ్యర్థుల జాబితాను ఫైనల్ చేసే పనిలో నిమగ్నమై ఉన్నారు. ముఖ్యంగా సీనియారిటీ లేదా ఇంకోటి ఇంకోటి అవన్నీ పక్కన పెడితే.. ఆయా నియోజకవర్గాలలో గెలవగలిగే అభ్యర్థులను మాత్రమే బరిలోకి దించడానికి బీజేపీ కసరత్తులు చేస్తోంది.

అంతా అనుకున్నట్లు జరిగితే ఈ రోజు రాత్రికి తొలి జాబితాను ప్రకటించే అవకాశం ఉంది. మరి ఇలా అయితే ఇంకెప్పుడు జాబితా రెడీ అవుతుంది. వాళ్ల్లు ఎప్పుడు తమ నియోజకవర్గం ప్రజలను కలిసి ప్రచారం చేసుకోవాలి.

Read more RELATED
Recommended to you

Latest news