బీజేపీ కేజ్రివాల్ ను అరెస్ట్ చేయాలని చూస్తోంది:మంత్రి అతిశీ

-

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు కీలక మలుపులు తిరుగుతోంది.ఇందులో ప్రముఖ రాజకీయ నాయకుడు ఉన్నాయంటూ మొదటినుంచీ అనుమానిస్తున్న ఈడీ.. ఇప్పటికే ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే .ఇక నెక్స్ట్ టార్గెట్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజీవాలేనని తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర మంత్రి అతిశీ సంచలనం ఆరోపణలు చేసింది.ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజీవాల్ను బీజేపీ ప్రభుత్వం అరెస్ట్ చేయాలని చూస్తోందని ఆ రాష్ట్ర మంత్రి అతిశీ విమర్శించారు. దీంతో తాము చట్టపరమైన అంశాలపై దృష్టి సారిస్తున్నట్లు ఆమె తెలిపారు.కాగా ఈ కేసులో తనను అరెస్ట్ చేయకుండా ఈడీని ఆదేశించాలంటూ హైకోర్టును ఆశ్రయించినా కేజీవాల్ కి ఫలితం లేకుండా పోయింది. ఈ దశలో తాము జోక్యం చేసుకోలేమని ధర్మాసనం తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news