విశాఖ తీరంలో 25 వేల కేజీల డ్రగ్స్ స్వాధీనం..

-

విశాఖపట్నం తీరంలో సిబిఐ భారీగా డ్రగ్స్ను స్వాధీనం చేసుకుంది.25 వేల కేజీల డ్రగ్స్‌ను సీ పోర్టు అధికారులు స్వాధీనం చేసుకున్న ఘటన విశాఖ తీరంలో కాసేపటి క్రితం చోటుచేసుకుంది.బ్రెజిల్ లోని శాంటోస్ పోర్టు నుంచి విశాఖకు వచ్చిన కంటైనర్లో డ్రగ్స్ను గుర్తించింది. ఇంటర్‌పోల్ ఇచ్చిన పక్కా సమాచారంతో….సీబీఐ చేపట్టిన ఆపరేషన్ గరుడులో భాగంగా సీపోర్టు అధికారులు 25 వేల కేజీల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.

డ్రై ఈస్ట్ మిక్స్ చేసి సుమారు వెయ్యి బ్యాగుల్లో ముఠా డ్రగ్స్‌ను తరలిస్తుండగా అధికారులు కంటైనర్‌ను సీజ్ చేశారు. అయితే, కంటైనర్ విశాఖలోని ఓ ప్రైవేటు కంపెనీ పేరుతో డెలివరీ అడ్రస్ తో డెలివరీ చేసేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఇక ఆ అడ్రస్ ఆధారంగానే కేసు నమోదు చేసిన సీబీఐ దర్యాప్తును ముమ్మరం చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news