కెసిఆర్ పై మోత్కుపల్లి ప్రశంసలు.. ఎప్పుడూ భగవంతుని ఆశీర్వాదం ఉంటుంది!

-

ఇవాళ జరిగిన అఖిలపక్ష సమావేశంలో సిఎం కెసిఆర్ పై మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు ప్రశంసల జల్లు కురిపించారు. మరియమ్మ లాకప్ డెత్ విషయంలో సిఎం కెసిఆర్ తీసుకున్న రక్షణ చర్యలు దళిత వర్గాల్లో చర్చనీయాంశమైందని… దళితుల్లో సిఎం పై విశ్వాసం పెరిగిందని కొనియాడారు మోత్కుపల్లి. ఎస్సీల అభివృద్ది గురించి ఇంతగా తపించే సిఎం కెసిఆర్ కు భగవంతుని ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉంటుందని మోత్కుపల్లి పేర్కొన్నారు. ప్రజల హృదయాల్లో శాశ్వతంగా ఉండే అవకాశాన్ని ఈ సమావేశం నిర్వహించడం ద్వారా మీరు సద్వినియోగం చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి.. దళితుల అభివృద్ధికి ఏమి చేయాలని.. మమ్మల్ని అందరినీ పిలిచి సలహాలు తీసుకోవడం.. దళిత సమాజంలో ఒక మానసిక ఉత్తేజం కలిగిందని… అందుకు సిఎం కెసిఆర్ కు ధన్యవాదాలు చెప్పారు మోత్కుపల్లి నర్సింహులు.

తెలంగాణ వచ్చిన తర్వాత వివిధ సందర్భాల్లో అన్యాయాలకు గురైన దళిత కుటుంబాలను గుర్తించి, ఆదుకొని వారికి రక్షణ చర్యలు ప్రకటించాలని కోరారు. దళిత సాధికారతలో భాగంగా దళారులు లేకుండా నేరుగా దళితులకు ఆర్థికసాయం అందిస్తెనే మేలు జరుగుతుందని.. రైతుబంధు పథకం లాగా నేరుగా ఆర్థిక సహాయం అందిస్తే దళితులు సంతోషిస్తారని వివరించారు. యాదగిరి గుట్టను.. ప్రపంచం గుర్తించే రీతిలో తీర్చిదిద్దుతున్నందుకు, అక్కడి నుంచి ఐదు సార్లు గెలిచిన ప్రజాప్రతినిధిగా కృతజ్ఞతలు తెలుపుతున్నానని మోత్కుపల్లి పేర్కొన్నారు. గురుకుల పాఠశాలలు వచ్చిన తర్వాత..దళిత విద్యార్థులు కూడా ఉన్నతస్థాయి ఉద్యోగాలు చేయాలనే ఆకాంక్షలు నెరవేరుతుండటం ఆనంద దాయకమన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news