థాంక్యూ విజయ్ సాయి రెడ్డి గారూ అంటున్న ఏపీ బీజేపీ సపోర్టర్లు ! 

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివాదాలతో విడి విడిగా ఉన్న బీజేపీ నాయకులను వైసిపి నాయకుడు విజయ్ సాయి రెడ్డి చేసిన వ్యాఖ్యల వల్ల వాళ్ళందరూ ఒక్క తాటిపైకి వచ్చారని, బీజేపీ నాయకులందరు విజయ్ సాయి రెడ్డికి థాంక్స్ చెప్పాలని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. కన్నా... కాణిపాకానికి ...కరోనా టెస్టింగ్ కిట్స్ కొనుగోలు విషయంలో గందరగోళం జరిగిందని, దీనిపై వివరణ ఇవ్వాలని బీజేపీ రాష్ట్ర ప్రతినిధి కన్నా లక్ష్మీ నారాయణ ఆరోపలను చేశారు. దీనికి బదులు కన్నా లక్ష్మీ నారాయణ టిడిపి నాయకులు అమ్ముడు పోయాడని వైసిపి నాయకుడు విజయ్ సాయి రెడ్డి వ్యాఖ్యానించారు. అయితే ఈ మొదట కన్నా మాత్రమే ఖండించారు. అయితే తరువాత బీజేపీ పెద్దల  నుండి వచ్చిన ఆదేశాల ప్రకారం మిగితా నాయకులు కూడా ప్రెస్ మీట్స్ పెట్టి కన్నాకు విజయ్ సాయి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
వైసీపీకి సానుభూతి పరుడుగా ఉంటున్నాడని విమర్శలు ఎదుర్కొంటున్న సోము వీర్రాజు కూడా ప్రెస్ మీట్ పెట్టి కన్నా లక్ష్మీ నారాయణకు విజయ్ సాయి రెడ్డి క్షమాపణలు చెప్పపాలని డిమాండ్ చేశారు. విజయ్ సాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలు బీజేపీ నాయకులను కలిపేలా చేశాయి.

Read more RELATED
Recommended to you

Latest news