సాయి గణేష్ కుటుంబానికి బిజెపి రూ.8 లక్షల ఆర్థిక సహాయం

-

బిజెపి తరుపున రూ. 8లక్షల రూపాయల చెక్కులు సాయి గణేష్ కుటుంబానికి అందజేసినట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. సాయి గణేష్ ను తెచ్చి ఇవ్వలేక పోయినా అండగా ఉంటాం.. ఇది చాలా దురదృష్టకరమన్నారు. ఇది నిజాం రాజ్యం కాదు…కుటుంబ రాజకీయాలు తెలంగాణ లో తెస్తామంటే ఒప్పు కోరు.. హుజూరాబాద్ లో వందల కోట్లు ఖర్చు పెట్టారు అయినా ప్రజలు టిఆర్ఎస్ ను తిరస్కరించారు… ఈటెల రాజేందర్ ను ప్రజలు గెలిపించారన్నారు.

నిజాంను కూల్చి వేసిన చరిత్ర చూశామని తెలిపారు. తుమ్మల హాయాంలో రోడ్లు అభివృద్ధి జరిగాయి.. ఖమ్మం లో ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని కోరారు. సాయి గణేష్ ఆత్మహత్య చేసుకున్నాడో అక్కడే టిఆర్ఎస్ భూ స్థాపం చేస్తామని.. పోలీసులు లక్ష్మణ్ రేఖ దాట వద్దు. మీకు కష్టాలు వస్తే ఎవరు అండగా ఉండరన్నారు.

కేటిఆర్ వస్తే ఏ ప్రాతిపదికన అరెస్టు చేస్తారు… నిజాం పాలన లా గా ఉందని.. ఖమ్మం జిల్లా టీచర్ ని చిత్తూరు వెళ్ళి మహిళా పోలీసులు అరెస్టు చేశారంటే పోలీసులు పని తీరు ఎందో ఆర్షం అవుతుందన్నారు. ఖమ్మం జిల్లాలో రౌడీ షీట్లు ఎంత మందిపై తెరిచారో చెప్పాలని డిమాండ్ చేశారు. హాత్య ప్రభుత్వం ది..స్థానిక మంత్రిదని.. సాయి గణేష్ అత్మహకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news