ఢిల్లీకి వెళ్లిన తెలంగాణ బీజేపీ నాయకులు… టీఆర్ఎస్ దాడులపై ఫిర్యాదు

-

తెలంగాణ సీనియర్ నాయకులు ఢిల్లీ బాట పట్టారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ తో పాటు, డీకే అరుణ, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఢిల్లీకి వెళ్లారు. ఇటీవల కాలంలో టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు.. బీజేపీ నాయకులపై దాడులు చేస్తుండటంతో.. ఈ దాడుల నేపథ్యంలో ఫిర్యాదు చేయున్నారు టీ బీజేపీ నేతలు. కేంద్ర మంత్రులతో పాటు, పార్లమెంట్ కార్యదర్శులకు ఫిర్యాదు చేయనున్నారు.

తెలంగాణ బీజేపీ పార్టీ ఇంఛార్జ్ తరుణ్ చుగ్ నివాసంతో తెలంగాణ బీజేపీ కోర్ కమిటీ సమావేశం కానుంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో పాటు దిల్లీ వెళ్లిన ఎమ్మెల్యే ఈటల రాజేందర్, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, మనోహర్ రెడ్డి ఈ భేటీలో పాల్గొంటారు. బీజేపీపై అసత్య ప్రచారం నిర్వహిస్తున్న ఓ పేపర్, టీవీ పై చర్చించనున్నట్లు తెలుస్తోంది. హఠాత్తుగా బీజేపీ నేతలు ఢిల్లీ పర్యటనకు వెళ్లడం చర్చనీయాంశం అయింది. ఈ భేటీలో అధికార టీఆర్ఎస్ పార్టీని ఎలా ఎదుర్కొవాలనేదానిపై చర్చ జరుగనుంది.

Read more RELATED
Recommended to you

Latest news