బెదిరిస్తే కాళ్లు, చేతులు విరగ్గొడుతాం … బీజేపీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు.

-

పశ్చిమ బెంగాల్ లో అధికార త్రుణమూల్ కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ మధ్య మాటల మంటలు చెలరేగుతున్నాయి. ఇరుపార్టీలు ఉప్పు నిప్పులాగా ఉన్నాయి. తాజాగా బీజేపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. బీజేపీ కార్యకర్తలను ఎవరైనా బెదిరిస్తే వారి కాళ్లు, చేతులు విరగ్గొడతాం త్రుణమూల్ కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి అనడం వివాదాస్పదం అయింది. పశ్చిమ బెంగాల్ బొంగావ్ సౌత్‌కు చెందిన బిజెపి శాసనసభ్యుడు స్వపన్ మజుందార్ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ మాటలు ఉన్న వీడియో బెంగాల్లో వైరల్ గా మారింది. ’ఇకపై ఏ నాయకుడైనా మా కార్యకర్తలను తప్పుడు కేసుల్లో ఇరికించాలని చూసినా.. భయబ్రాంతులకు గురిచేసిన ఆనాయకుడు ఇక ఇంటికి క్షేమంగా తిరిగి వెళ్లకపోవచ్చు‘ అని టీఎంసీని ఉద్దేశించి హెచ్చరించారు. కాగా స్థానికంగా ఉండే టీఎంసీ నాయకుడు బీజేపీ కార్యకర్తలను బెదిరింపులకు దిగడంతోనే బీజేపీ ఎమ్మెల్యే ఈవ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది. 

అయితే ఈ వ్యాఖ్యలపై త్రుణమూల్ కాంగ్రెస్ తీవ్రంగానే స్పందించింది. టీఎంసీ అధికార ప్రతినిధి కునాల్ ఘోష్ స్పందిస్తూ.. ఇది బీజేపీ నేతల ఆలోచనా ధోరణిని, సంస్కృతిని తెలియజేస్తోందని పేర్కొన్నారు. ఇలాంటి భాష, మాటలు, బెదిరింపులను తీవ్రంగా ఖండిస్తున్నామని, ఈ ప్రాంతంలో తృణమూల్ కాంగ్రెస్‌కు ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో విసుగు చెంది ఇలాంటి బెదిరింపులకు పాల్పడుతున్నారని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news