బ్రేకింగ్: గోదావరి జిల్లాలకు పాకిన బ్లాక్ ఫంగస్

-

పశ్చిమ గోదావరి జిల్లాలో బ్లాక్ ఫంగస్ కలకలం రేపింది. తాజాగా ఈ జిల్లాలో రెండో కేసు నమోదు అయింది. కాళ్ల మండలం యల్ యన్ పురంకు చెందిన సూర్యనారాయణ అనే వ్యక్తికి బ్లాక్ ఫంగస్ సోకిందని గుర్తించారు. ఇటీవలే కరోనాకు చికిత్స పొందిన సూర్యనారాయణకు ఈ వ్యాధి సోకిందని వెల్లడించారు. బ్లాక్ ఫంగస్ గా విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ వైద్యులు నిర్ధారించారు.

అయితే ఈ విషయం తెలిసినా సరే వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది మాత్రం పట్టించుకోవడం లేదు. దీనితో సొంతంగానే ఇంట్లో బాధితుడు చికిత్స తీసుకుంటున్నాడు. ఆంధ్రప్రదేశ్ లో ఈ వ్యాధిని ఆరోగ్య శ్రీలో చేరుస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. అయితే క్షేత్ర స్థాయిలో ఉన్న అధికారులు మాత్రం ఈ అంశాన్ని పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news