చికాగోలో తెలంగాణ విద్యార్థిపై నల్ల జాతీయుల కాల్పులు

-

ఉన్నత చదువుల కోసం చికాగో వెళ్లిన తెలంగాణ విద్యార్థిపై నల్ల జాతీయులు కాల్పులు జరిపారు. గవర్నర్ స్టేట్ యూనివర్సిటీలో చదువుతున్న కొప్పాల సాయి చరణ్ పై నల్ల జాతీయులు విచక్షణ రహితంగా కాల్పులు జరపడంతో శరీరంలోకి బుల్లెట్లు దూసుకు వెళ్ళాయి. ఈ కాల్పులలో సాయిచరణ్ తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది.

దీంతో సాయి చరణ్ ని హుటాహుటిన చికాగో యూనివర్సిటీ మెడికల్ సెంటర్ కి తరలించి చికిత్స అందిస్తున్నారు వైద్యులు. సాయి చరణ్ తల్లిదండ్రులు బిహెచ్ఇఎల్ ఎల్ఐసి కాలనీలో నివాసం ఉంటున్నారు. సాయి చరణ్ స్నేహితులు జరిగిన ఘటనని అతని తల్లిదండ్రులకి సమాచారం ఇచ్చారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news