ప్రకాశం జిల్లాలో కలకలం.. ప్రాంగణంలో మాంసపు ముక్కలు, రక్తం చల్లి !

-

దర్శి పడమటి బజార్ లో కలకలం రేగింది. శ్రీ కృష్ణ ఆలయంలో అర్ధరాత్రి సమయంలో ఆలయ ప్రాంగణంలో రక్తం చల్లి మాంసపు ముక్కలని గుర్తు తెలియని వ్యక్తులు వెదచల్లారు. ఆలయ గోడలకు రక్తంతో ముద్రలు వేశారు. ఎవరైనా ఆలయ ప్రాంగణంలో ఏదైనా జంతువును వధించి ఈ పని చేసి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తం అవుతోంది. ఇది ఆలయానికి తీవ్ర అపచారం అని భావిస్తున్నారు స్థానికులు.

ఆలయానికి వచ్చే భక్తులను భయబ్రాంతులకు గురి చేసేందుకే ఈ దుశ్చర్యకు పాల్పడి ఉంటారంటున్నారు భక్తులు..ఆలయ ప్రాంగణంలోనే ఉన్నమాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి వేసిన శిలా ఫలకానికి కూడా రక్తం పూశారు దుండగులు. నిన్న దర్శిలో జరిగిన సీఎం జగన్ జన్మదిన వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే బూచేపల్లిపై ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అదే రోజు రాత్రి ఈ ఘటన చోటుచేసుకోవటంతో రాజకీయ పాత్రపై సర్వత్రా చర్చ జరుగుతోంది. పోలీసులు ఆలయానికి చేరుకొని పరిశీలిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news