తండ్రి కొడుకులతో వరుస సినిమాలు చేయటానికి రెడీ ఐన ..హనుమాన్ జంక్షన్ డైరెక్టర్…!?

-

మోహన్ రాజా తమిళంలో మంచి పేరున్న దర్శకుడు. గతంలో తెలుగులో ‘హనుమాన్ జంక్షన్’ చిత్రానికి దర్శకత్వం వహించిన రాజా… ఆ తర్వాత తమిళంలో బిజీ అయిపోవడం వల్ల తెలుగులో మళ్లీ చేయలేదు. ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు ఏకంగా మెగాస్టార్ చిరంజీవి నటించే చిత్రానికి దర్శకత్వం వహిస్తూ మళ్లీ టాలీవుడ్ కి వస్తున్నాడు.మెగా ఇలాకాలో స్ట్రాంగ్ సెంటిమెంట్ ఒకటి చాలా రోజులుగా నడుస్తుంది . ఇది తెలియాలంటే చరణ్ చేసిన ధృవ సినిమా దగ్గర మొదలు పెట్టాలి . సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేసిన ధృవ సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారట మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ . స్టోరీ కూడా రెడీగా ఉన్నట్లు సమాచారం . దానికి డైరెక్టర్ ఎవరంటే …మెగా స్టార్ తో లూసిఫర్ సినిమారీమేక్ చేస్తున్న మోహన్ రాజా .

రీసెంట్ గా చిరు కోసమే కోలీవుడ్ నుండి టాలివుడ్ కి ఇంపొట్ అయ్యారూ .చిరుతో సినిమా చేస్తున్న మోహన్ రాజా …ఆ వెంటనే చెర్రీతో ధృవ రీమేక్ కి ఒక కమిట్ మెంట్ ఇచ్చేశారన్నమాట . అందులో రామ్ చరణ్ హీరోగా నటించనున్నట్టు సమాచారం.తెలుగు, తమిళ భాషల్లో దీనిని ఏకకాలంలో నిర్మిస్తారట. వచ్చే ఏడాది సెకండాఫ్ లో ఈ చిత్రం సెట్స్ కి వెళుతుందని అంటున్నారు.

గతం లో చెర్రీ తో ధృవ మూవీ చేసిన సురేందర్ రెడ్డి తో ఇష్టపడి సైరా మూవీ చేయించుకున్నారు చిరు . అలాగే డైనమిక్ డైరెక్టర్ వీవీ వినాయక్ కూడా మెగా ఫాదర్ అండ్ సన్ తో డబల్ ధమాకా ఇచ్చారు . చెర్రీ తో నాయక్ ,చిరు తో ఠాగూర్ ,ఖైదీ నే౦ 150 సినిమాలు తీసాడు . చిరుతో అందరివాడు ,చెర్రీ తో బ్రుస్లీ సినిమాలు చేసి మెగా కాంపౌండ్ తొక్కాడు శ్రీను వైట్ల . ఇప్పుడు చిరు తో లూసిఫర్ అయ్యాక చెర్రీ తో ధృవ సీక్వెల్ చేస్తున్నారు మోహన్ రాజా . ఒక్క సారి మెగా కాంపౌండ్ లోకి అడుగుపెట్టారో … డ్యూయల్ డైరక్షన్ కంపల్సరీ అన్నమాట .తండ్రి తో చేస్తే కొడుకుతో ,కొడుకుతో చేస్తే తండ్రితో ఇలా నాన్ స్టాప్ గా నడుస్తున్న సెంటిమెంట్ ఇది . ఈ లెక్కన ఆచార్య క్యాప్టెన్ కొరటాల శివ ,వేదాళం దర్శకుడు మెహర్ రమేష్ కూడా చెర్రీ కోసం కథలు రెడీగా పెట్టుకున్నారేమో చూడాలి .

Read more RELATED
Recommended to you

Latest news