రణ్​వీర్​ న్యూడ్​ ఫొటోషూట్​ కేసు.. ఆ ఫొటోను మార్ఫింగ్ చేశారట!

-

సామాజిక మాధ్యమాల్లో నగ్న ఫొటోలు పోస్ట్‌ చేసిన వ్యవహారంలో బాలీవుడ్‌ నటుడు రణ్‌వీర్‌సింగ్​కు పోలీసులు కొద్ది రోజుల క్రితం నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో అతడు ఆగస్టు 29న పోలీసుల ముందు విచారణకు హాజరయ్యారు. అతడి స్టేట్​మెంట్​ను పోలీసులు రికార్డు చేశారు. అయితే తాజాగా ఆ స్టేట్​మెంట్​లో రణ్​వీర్​ ఏం చెప్పాడో పోలీసులు వెల్లడించారు. ఈ న్యూడ్​ ఫొటోస్​ ఓ ట్విస్ట్​ చోటు చేసుకుందని అన్నారు.

తాను పోస్ట్ చేసిన నగ్న ఫొటోల్లో ఒకటి మార్ఫింగ్​ చేశారని రణ్​వీర్​ చెప్పారట. ఈ విషయాన్ని అధికారులు తెలిపారు. తాను పోస్ట్​ చేసిన ఆ న్యూడ్​ ఫొటోలో అండర్​వేర్​ వేసుకున్నట్లు రణ్​వీర్​ చెప్పినట్లు వెల్లడించారు. ఆ ఫొటో మార్ఫింగ్ చేశారని పోలీసులతో రణ్​వీర్ చెప్పారట! అయితే దీనిపై తాము దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఆ ఫొటో మార్ఫింగ్​ అయిందా లేదా అని తెలుసుకునేందుకు ఫోరెన్​సిక్​ ల్యాబ్​కు పంపించినట్లు చెప్పారు.

కాగా, రణ్‌వీర్‌ తన నగ్న ఫొటోలను పోస్ట్‌ చేయడం ద్వారా మహిళల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించడంతో పాటు వారిని అవమానపరిచారంటూ ఓ ఎన్జీవోతో పాటు ఓ మహిళా న్యాయవాది పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు కేసు నమోదు చేసి రణ్​వీర్​ను విచారణకు పిలిచి దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news