బాలీవుడ్ స్క్రీన్ మరువలేని రిషీ కపూర్…

-

ఇండియన్ సినిమాలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరో రిషీ కపూర్. క్యాన్సర్ తో ఆయన గురువారం మరణించడంతో బాలీవుడ్ పరిశ్రమ ఒక్కసారిగా శోక సంద్రంలో మునిగిపోయింది. ఇండియన్ సినిమా నట దిగ్గజం రాజ్ కపూర్- కృష్ణ కపూర్ దంపతులకు 1952 సెప్టెంబర్ లో జన్మించిన రిషీ కపూర్… సినిమాల మీద ఉన్న ప్రేమ తో తన తండ్రి హీరోగా వచ్చిన మేరా నాం జోకర్ సినిమాలో బాల నటుడిగా అలరించారు. ఆ సినిమా ఫ్లాప్ కావడంతో తన కెరీర్ ని ఫ్లాప్ తోనే మొదలుపెట్టారు ఆయన.

కాని సరిగా మూడేళ్ళ తర్వాత వచ్చిన బాబీ సినిమా ఆయను ఓవర్ నైట్ స్టార్ ని చేసింది. ఆ సినిమాలో రిషీ నటన బాలీవుడ్ స్క్రీన్ మీద చెరగని ముద్ర వేసింది. అక్కడి నుంచి ఇక వెనుతిరిగి చూడలేదు రిషీ కపూర్. అయితే బాబీ సినిమాను మేరా నాం జోకర్ నష్టాల నుంచి బయట పడటానికి తీసినట్టు రాజ్ కపూర్, రిషీ కపూర్ ఇద్దరూ ఒక సందర్భంలో వ్యాఖ్యానించారు. ఆ తర్వాత 51 చిత్రాల్లో రిషీ కపూర్ హీరోగా నటించారు.

11 సినిమాలు మాత్రమే బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలు సాధించాయి. 41 మల్టీ-హీరో చిత్రాలలో 25 బాక్సాఫీస్ వద్ద విజయవంతమయ్యాయి. బాబీ, లైలా మజ్ను, రఫూ చక్కర్, సర్గం, కర్జ్, ప్రేమ్ రోగ్, నాగినా, హనీమూన్, చాందిని, హీనా మరియు బోల్ రాధా బోల్, యే వాడా రాహా. ఖేల్ ఖేల్ మెయిన్, కబీ కబీ, హమ్ కిసిస్ కమ్ నహీన్, బడాల్టే రిష్టే, ఆప్ కే దీవానే, మరియు సాగర్ సినిమాలు ఆయనకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి.

1999 లో రాజేష్ ఖన్నా, ఐశ్వర్య రాయ్ మరియు అక్షయ్ ఖన్నా ప్రధాన పాత్రల్లో నటించిన ఆ అబ్ లాట్ చాలెన్ చిత్రానికి ఆయన దర్శకత్వం వహించారు. 2000 నుంచి ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించారు. హై జల్వా (2002), హమ్ తుమ్ (2004), ఫనా (2006), నమస్తే లండన్ (2007), లవ్ ఆజ్ కల్ (2009) మరియు పాటియాలా హౌస్ (2010) వంటి చిత్రాలలో నటించారు.

సహనటి అయిన నటి నీతు సింగ్ ను 22 జనవరి 1980 న వివాహం చేసుకున్నారు. అయితే తన కొడుకు రణబీర్ కపూర్ హీరోగా నటించడం ఆయనకు ఇష్టం లేదని చెప్తూ ఉంటారు. ఆయన పలు మార్లు తన కొడుకుని తాను అసలు హీరోగా గుర్తించను అంటూ వ్యాఖ్యానించడం సంచలనం రేపింది. ఇక పలు సినిమాలకు ఆయన నిర్మాతగా కూడా వ్యవహరించారు. ఆ సినిమాల్లో ఎక్కువ భాగం హిట్స్…

Read more RELATED
Recommended to you

Latest news