ఈ నెల 25 నుంచి బోనాల పండుగ : 15 కోట్లు విడుదల చేసిన తెలంగాణ సర్కార్

-

ఈ నెల 25న ఆషాడమాసం బోనాలు నిర్వహించడానికి తెలంగాణ సర్కార్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున ఆషాడమాసం బోనాల నిర్వహణ, ఏర్పాట్లపై మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (MCHRD) లో అత్యున్నతస్థాయి సమావేశం నిర్వహించారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఈ సందర్భంగా శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. గత సంవత్సరం కరోనా మహమ్మారి కారణంగా బోనాలను నిర్వాహించుకోలేక పోయామని.. ఈ సంవత్సరం ఘనంగా ఆషాడ బోనాలను నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించారని పేర్కొన్నారు.

బోనాల ఉత్సవాల నిర్వహణ కోసం వివిధ ఆలయాలకు ఆర్ధిక సహాయం అందించేందుకు 15 కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నామని స్పష్టం చేశారు. జులై 11 న గోల్కొండ బోనాలు, 25 వ తేదీన సికింద్రాబాద్ బోనాలు, ఆగస్టు 1 వ తేదీన హైదరాబాదు బోనాల ఉత్సవాలు నిర్వహిస్తామని వెల్లడించారు. కాగా… ప్రతి ఏడాది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడే ముందు ఈ బోనాల పండుగ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.  ఇందులో భాగంగానే ఈ సారి కూడా బోనాలు పండుగ నిర్వహించాలని సర్కార్ నిర్ణయం తీసుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news