ఈ సంవత్సరం బోనాల పండుగను ఘనంగా నిర్వహిస్తాం: మంత్రి పొన్నం ప్రభాకర్

-

ఈ సంవత్సరం ఘనంగా నెల రోజులపాటు బోనాల పండుగను నిర్వహిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. ఆషాఢ మాసం బోనాలపై హైదరాబాద్‌ కలెక్టరేట్‌లో ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. బోనాల పండగ సమీపిస్తున్న నేపథ్యంలో వివిధ డిపార్ట్మెంట్ చేయాల్సిన ఏర్పాటు ,హైదరాబాద్ నగర పరిధిలో ఉన్న గుడిలకి విద్యుత్ అలంకరణ ,భక్తులకు తాగు ఏర్పాట్లు ,విద్యుత్ ఇబ్బందులు లేకుండా చూడడం ,దేవాలయాల వద్ద భద్రత ,పార్కింగ్ ప్రదేశాలు తదితర అంశాలపై మంత్రి ఉన్న ప్రభాకర్ అధికారులతో చర్చించారు. హైదరాబాద్‌ పరిధిలో 2 వేల 400కు పైగా దేవాలయాలున్నాయని.. బోనాల సందర్భంగా ఆలయాలకు ఇచ్చే నిధులు పెంచుతామని ఆయన తెలిపారు. 28 ప్రముఖ ఆలయాలకు ప్రజాప్రతినిధులే పట్టు వస్త్రాలు సమర్పిస్తారని మంత్రి తెలిపారు.

కాగా, భాగ్యనగరంలో ప్రతి సంవత్సరం మొట్టమొదట గోల్కొండ బోనాలతో సందడి షురూ అవుతుంది. ఒకప్పుడు తెలంగాణ వ్యాప్తంగా ప్రతి ఒక్క ఊరిలో బోనాల పండుగను ఘనంగా జరుపుకునేవారు. అందుకే ఈ బోనాల పండుగను తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించి.. ప్రతి సంవత్సరం ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తూ వస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news