బ్రేకింగ్;ఏపీలో ఒక్క రోజే 34 కేసులు నమోదు…!

-

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ కేసులు రోజు రోజుకి పెరుగుతున్నాయి. భారీగా కరోనా కేసులు నమోదు అయ్యాయి నేడు. నేడు మొత్తం రాష్ట్రంలో 34 కేసులు నమోదు అయ్యాయి. మొత్తం 348 కి చేరుకున్నాయి కరోనా కేసులు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. 9 గంటల్లో 19 కేసులు నమోదు అయ్యాయి. నలుగురు ప్రాణాలు కోల్పోయారు. గుంటూరు 8, ప్రకాశం 7 పశ్చిమ గోదావరి ఒక కేసు తాజాగా నమోదు అయింది.కర్నూలు జిల్లాలో అత్యధికంగా 75 కేసులు నమోదు అయ్యాయి. వ్యాధి 9 మందికి నయం అయింది. గుంటూరు 48, నెల్లూరు 49 కేసులు నమోదు అయ్యాయి. అనంతపురం లో 13 కేసులు నమోదు అయ్యాయి. కడప లో 28 కేసులు నమోదు అయ్యాయి. ప్రకాశం జిల్లాలో 27 కేసులు నమోదు కాగా పశ్చిమ గోదావరి జిల్లాలో 22 కేసులు, విశాఖ 20 కేసులు నమోదు అయ్యాయి. చిత్తూరు జిల్లాలో 20 కేసులు బయటపడ్డాయి. తూర్పు గోదావరి జిల్లాలో 11 కేసులు గుర్తించారు. ప్రస్తుతానికి కరోనా ఫ్రీ జిల్లాలు గా శ్రీకాకుళం విజయనగరం జిల్లాలు ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news