BREAKING: TSPSC పేపర్ లీకేజీ నిందితులకు 14 రోజుల రిమాండ్

-

TSPSC paper leakage: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన టిఎస్పిఎస్సి ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో అరెస్ట్ అయిన 9 మంది నిందితులకు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. నిందితులకు గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. వీరికి న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది.

 

టీఎస్పీఎస్సీ ఉద్యోగి ప్రవీణ్, ఔట్సోర్సింగ్ ఉద్యోగి రాజశేఖర్, పేపర్ లీకేజీ సూత్రధారి రేణుక సహా ఈ వ్యవహారంలో సంబంధం ఉన్న నిందితులకు న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్, వెటర్నరీ అసిస్టెంట్ పరీక్ష ప్రశ్నాపత్రాలు మాత్రమే కాకుండా మార్చి 5న జరిగిన అసిస్టెంట్ ఇంజనీరింగ్ క్వశ్చన్ పేపర్ కూడా లీక్ అయినట్లు పోలీసులు గుర్తించారు. ఇలా ఇప్పటికే పలు పరీక్ష పేపర్లు లీక్ అయినట్లు అనుమానం వ్యక్తం చేస్తుండడంతో నిందితులను పోలీసులు పూర్తిస్థాయిలో విచారించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news