బ్రేకింగ్: టీడీపీకి మరో షాక్

-

ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీకి మరో దెబ్బ తగులుతుంది. టీడీపీ నుంచి గత ఎన్నికల్లో కాకినాడ పార్లమెంట్ కి పోటీ చేసి ఓటమి పాలైన చలమలసెట్టి సునీల్ వైసీపీలోకి వెళ్తున్నారు. వంగా గీత చేతిలో గత ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు. ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన ఆయన మళ్ళీ ఇప్పుడు వైసీపీలోకి వెళ్తున్నారు. నేడు ఆయన పార్టీ మారుతున్నట్టు తెలుస్తుంది.

2014 ఎన్నికల్లో ఆయన కాకినాడ నుంచి వైసీపీ తరుపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత నాలుగేళ్ళు వైసీపీలోనే ఉన్నా సరే మళ్ళీ రాజకీయ పరిణామాల నేపధ్యంలో ఆయన్ టీడీపీలో జాయిన్ అయ్యారు. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆయనకు బలమైన నేతగా గుర్తింపు ఉన్నా సరే విజయం మాత్రం ఇప్పటి వరకు సాధించలేదు.

Read more RELATED
Recommended to you

Latest news