BREAKING: నలుగురు వైసిపి ఎమ్మెల్యేలపై వేటు

-

ఆంధ్రప్రదేశ్ లోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుండి నలుగురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది ఆ పార్టీ. ఈ విషయాన్ని ఆ పార్టీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. ఇక సస్పెండ్ అయిన వారిలో ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి ఉన్నట్లు సమాచారం.

ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. జగన్ చివరి నిమిషంలో చెప్పి షాక్ లు ఇవ్వరని.. పారదర్శకంగా వ్యవహరించే నాయకుడు జగన్ అని అన్నారు. చంద్రబాబు నాయుడు వారికి 20 కోట్ల డబ్బులు ప్రలోభ పెట్టారని తమకు సమాచారం ఉందన్నారు. మాకు ఉన్న సమాచారం ఆధారంగానే ఈ నలుగురు క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారని పార్టీ ఒక అభిప్రాయానికి వచ్చిందని వెల్లడించారు. ఇది ఒక రోగం లాంటిదని.. అందుకే ముందే నిర్ణయం తీసుకున్నామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news