BREAKING NEWS: స్టీవ్ స్మిత్ లేకుండానే బరిలోకి ఆస్ట్రేలియా !

-

ముంబై లోని వాంఖడే స్టేడియంలో జరగనున్న మ్యాచ్ లో సెమీస్ కు చేరడానికి ఆస్ట్రేలియా మరియు ఆఫ్గనిస్తాన్ లు తలపడనున్నాయి. ఆస్ట్రేలియాకు రెండు మ్యాచ్ లు ఉండగా ఒకటి గెలిస్తే సెమీస్ చేరుతుంది. అదే విధంగా ఆఫ్గనిస్తాన్ కు సెమీస్ అవకాశాలు ఉన్నా, మిగిలి ఉన్న రెండు మ్యాచ్ లు గెలవడంతో పాటు రన్ రేట్ ను మెరుగు పరుచుకోవాలి. ఇక తాజాగా ఆస్ట్రేలియా క్రికెట్ నుండి అందుతున్న బ్రేకింగ్ న్యూస్ ప్రకారం ఈ మ్యాచ్ లో వన్ డౌన్ బ్యాట్స్మన్ స్టీవెన్ స్మిత్ లేకుండానే బరిలోకి దిగుతోంది. ఇప్పటికే మాక్స్ వెల్ గాయం కారణంగా గత మ్యాచ్ లో దూరం అయ్యి ఈ మ్యాచ్ లో ఆడుతున్నాడు, అదే విధంగా స్టీవెన్ స్మిత్ ఫిటినెస్ సమస్య వలన ఈ మ్యాచ్ కు దూరం అయ్యాడు. ఈ వరల్డ్ కప్ లీగ్ లో జరగనున్న ఆఖరి మ్యాచ్ తో స్మిత్ ఆడుతాడని కోరుకుందాం.

ఇక ఈ మ్యాచ్ లో మొదట టాస్ గెలిచిన పాట్ కమిన్స్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. మరి ఆఫ్గనిస్తాన్ స్పిన్నర్లు ను సమర్థవంతంగా ఎదుర్కొంటుందా చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news