బ్రేకింగ్; ఔటర్ రింగ్ రోడ్ బంద్…!

-

కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి తెలంగాణా పోలీసు శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ రింగ్ రోడ్ ని మూసి వేస్తున్నామని సైబరాబాద్ సీపీ సజ్జనార్ ప్రకటించారు. ఐటి ఫార్మా కంపెనీ ప్రతినిధులకు పాస్ లు జారీ చేస్తామని ఆయన ప్రకటించారు. అత్యవసర సర్వీసులకు పాస్ లు జారీ చేస్తామని, త్వరలోనే పాస్ లు జరీ చేసి మూసి వేస్తామని ఆయన ప్రకటించారు. ఇప్పటికే లాక్ డౌన్ ని రాష్ట్రంలో కఠినంగా అమలు చేస్తున్నారు.

అత్యవసర సేవల వారికి మాత్రమే పాస్ లు జారీ చేస్తామని అన్నారు. ప్రజలు ఎవరూ కూడా బయటకు రావొద్దని ఆయన ప్రకటించారు. ఎవరు బయటకు వచ్చినా సరే కఠిన నిర్ణయాలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఎవరు బయటకు వచ్చినా సరే జైలుకి పంపడానికి కూడా తాము వెనుకాడేది లేదని మొహమాటం లేకుండా జైలుకి పంపిస్తామని ఆయన హెచ్చరించారు. సాయంత్రం మరిన్ని కట్టడి చేసే చర్యలు తీసుకుంటామని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news