BREAKING: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఘటనలో ప్రధాన సూత్రధారి అరెస్టు

-

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన విధ్వంసకాండ లో ప్రధాన సూత్రధారిని అరెస్టు చేశారు పోలీసులు. నరసరావుపేటకు చెందిన సాయిడిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ ఆవుల సుబ్బారావు ప్రధాన సూత్రధారి అని పోలీసులు తేల్చారు. ఖమ్మంలో అదుపులోకి తీసుకుని నరసరావుపేట కు తరలించారు పోలీసులు. అగ్నిపధ్ వల్ల నష్టం కలుగుతుందని వీడియో సందేశం ద్వారా ఆర్మీ అభ్యర్థులను రెచ్చగొట్టినట్లు పోలీసులు గుర్తించారు. అలాగే మిగతా ప్రైవేట్ సెంటర్ల నిర్వాహకులు ఆందోళనకారులకు సహకరించినట్లు గుర్తించారు.

రెండు రోజుల క్రితమే వాట్సాప్ గ్రూపు క్రియేట్ చేసి విధ్వంసానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఆర్మీ అభ్యర్థులతో పాటు ప్రైవేటు వ్యక్తులు చొరబడినట్లు గుర్తించారు పోలీసులు. ఆదిలాబాద్ నుంచి కృష్ణ ఎక్స్ప్రెస్ లో వచ్చిన మూడు వందల మంది అభ్యర్థులను గుర్తించారు. సీసీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాల ఆధారంగా ఆందోళనకారులను పోలీసులు గుర్తిస్తున్నారు. ఆందోళనకారులపై 14 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు రైల్వే పోలీసులు.ఐఆర్ఎ రైల్వే చట్టం సెక్షన్ 150 నమోదు చేసిన పోలీసులు.. ఈ సెక్షన్ కింద నేరం రుజువైతే యావజ్జీవం లేదా మరణ శిక్ష పడే అవకాశం ఉన్నట్లు సంచారం అందుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news