బ్రేకింగ్: తెరాస ఎమ్మెల్యే మృతి…!

-

దుబ్బాక ఎమ్మెల్యే రామలింగా రెడ్డి అనారోగ్యంతో మృతి చెందారు. హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్టు ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. 2004, 2008 ఉప ఎన్నికల లో దొమ్మాట నుంచి టీ ఆర్ ఎస్ ఎమ్మెల్యే గా గెలిచారు. 2014 ,2018 ఎన్నికల లో దుబ్బాక నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు ఆయన. ఐదు సార్లు పోటీ చేస్తే నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఒక్కసారి ఓడిపోయిన సోలిపేటకు సౌమ్యుడిగా పేరు ఉంది.

పౌర హక్కులు సంఘము, మాజీ మావోయిస్టు, జర్నలిస్ట్ గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. వరుసగా రెండోసారి శాసనసభ అంచనాల కమిటీ చైర్మన్ గా వ్యవహరిస్తున్న లింగారెడ్డి… దుబ్బాకలో చిట్టాపూర్ సొంత గ్రామం. తల్లిదండ్రులు మాణిక్యమ్మ ,రామకృష్ణారెడ్డి. ఆరుగురు సంతానంలో ఆఖరి వాడు రామలింగారెడ్డి

Read more RELATED
Recommended to you

Latest news