రియా చక్రవర్తికి సమన్లు జారీ చేసిన ఈడీ..!

-

బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో అతని గర్ల్ ఫ్రెండ్, నటి రియా చక్రవర్తి ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా రియాకు ఈడీ సమన్లు జారీ చేసింది. శుక్రవారం తమ ముందు విచారణకు హాజరుకవాలని తెలిపింది. కాగా రియా ఈ మధ్యకాలంలో కొనుగోలు చేసిన రెండు హై-ఎండ్ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీల నేపథ్యంలో ఈడీ సమన్లు జారీ చేసిందని తెలుస్తుంది. కాగా, సుశాంత్ తండ్రి ఇప్పటికే రియాపై బీహార్‌లోని పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

అలాగే రియా చక్రవర్తి సుశాంత్ ఖాతా నుంచి రూ.15 కోట్లు మాయం చేసిందని ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ నేపధ్యంలో ఈడీ ఈ కేసుపై దృష్టి సారించినట్టు తెలుస్తుంది. ఇదిలా ఉంటే.. సుశాంత్ ఆత్మహత్య కేసులో సీబీఐ విచారణకు కేంద్రం కూడా తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇకపోతే సుశాంత్ సింగ్ ముంబయిలోని బాంద్రా ప్రాంతంలోని తన ఇంట్లో జూన్ 14 న చనిపోయారు.

Read more RELATED
Recommended to you

Latest news