BREAKING: మంత్రికి గుండె నొప్పి హాస్పిటల్ కు తరలింపు…!

-

ఆంధ్రప్రదేశ్ కాబినెట్ లో మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఆరోగ్యం పై తాజాగా అందిన వార్త రాష్ట్ర ప్రజలను కలవరపాటుకు గురి చేస్తోంది. తెలుస్తున్న సమాచారం మేరకు మంత్రి వేణుగోపాల కృష్ణకు స్వల్పంగా గుండె పోటు వచ్చింది, వెంటనే మంత్రిని మొదటగా విజయవాడ లోని ప్రభుత్వ హాస్పిటల్ కు తీసుకువెళ్లారు. ప్రథమచికిత్స చేసిన అనంతరం ఆయన్ను మెరుగైన చికిత్స కోసం వెంటనే హాస్పిటల్ ను మార్చాలంటూ వైద్యులు చేసిన సూచన మేరకు ఆయన్ను వెంటనే మణిపాల్ హాస్పిటల్ కు తరలించడం జరిగింది. ప్రస్తుతం మణిపాల్ హాస్పిటల్ లో ఉన్న మంత్రి వేణుగోపాల్ కృష్ణను 24 గంటల పాటు అత్యవసర చికిత్స చేసిన తర్వాతనే విషయం ఏమిటన్నది వెల్లడిస్తామని వైద్యులు చెప్పడంతో అందరూ ఆందోళనకు గురవుతున్నారు.

ఇక మణిపాల్ హాస్పిటల్ నుండి తర్వాత రానున్న అప్డేట్ గురించి అందరూ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. ఇక ఈ వార్త నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ వైసీపీ నాయకులు మంత్రిని పరామర్శించడానికి హాస్పిటల్ కు చేరుకుంటున్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news